republic day

republicdayintelugu.jpg

Thursday 22 March 2012

తెలుగు సంవత్సరాది శుభాకంక్షలు

                               అంతర్జాల చదువరులకు "ఉగాది శుభాకంక్షలు"

యాగాలు చేస్తే ..........వస్తుందా!?

K C R  గారు  తెలంగాణ  రాష్ట్రం  కోసం  ఎపుడు  పడితే  అప్పుడు "యాగాలు" చేయిస్త్తుంటారు..
 యాగాలు చేస్తే  రాష్ట్రల్లోస్తాయా?!!! (మంత్రాలకు  చింతకాయలు రాలతాయా)


          గాంధీ గారు  యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చారా?
          రష్యన్ విప్లవం యాగాలతో వచ్చిందా!
          జార్జ్ వాషింగ్టన్ యాగాలతో  అమెరికాకు independence తెచ్చాడా!!


K C R అంటే   కాదు,  చెయ్యలేడు,  రాదు! అని చెప్పుకోవలసి వస్తుందేమో!
  ఎందుకంటే గత పదేండ్ల నుండి మనము గమనించినట్లయితే ,ఆయనకు  తెలంగాణా  రాష్ట్రవతరణము  మీద     ఇంటరెస్ట లేదోమో అనిపిస్తుంది.ఏదో ఎలక్షన్లప్పుడో,తెలంగాణా ప్రజలు తనను మరచిపోతునారేమో అని                     అనిపించినపుడో  అలా ప్రజల్లోకొచ్చి,బూతులతోకూడిన  ఉపన్యసాలివ్వడము,ప్రజలను రెచ్చకొట్టడము తప్ప  రాష్ట్ర   సాధన కోసం ఈ దశాబ్ద కాలంలో అయన చేసింది ఏమీ లేదు.
 ఈ దశాబ్ద కాలంలో ఒరిగిందేమైనఉందంటే-1.తెలంగాణ భవన నిర్మితం  
                                                             2. కూతురికి తెరాస లో పదవి
                                                              3 .కుమారునికి  MLA   పదవి
                                                              4.  మేనల్లుడికి  MLA  పదవి
                                                              5 .తన ఆస్తుల  పెరుగుదల
ఇవన్ని పచ్చి నిజాలు,నిస్టుర సత్యాలు.ఈ ఉద్యమము ప్రారంభమునుండి   ఇప్పటివరకు ఏ లాభము పొందని (ఈ ఉద్యమము ద్వారా)ఎంతోమంది అమాయకులు, అమాయక విద్యార్థులు ప్రాణ త్యాగం చేసారు. వారికి ఒరిగిందేమిటి?కేవలం వారి ఫోటోలకు పూలదండలు తప్పితే?
         గొప్పలు చెప్పుకొనే  ఈ తెరాస నాయకులు అందరు ప్రాణాలర్పించిన
వారి కుటుంబాలకు చేసిన మేలేమిటి? "తమబిడ్డలు చదువుకొని అభివ్రుద్దికొచ్చి తమ కస్టాలు తీర్చి తమ జీవితాలనుబాగుపరుస్తారులే అని కళలు కన్న ఆ పేద ,అమాయకుల తల్లిదండ్రుల ఆవేదనను తీర్చేదెవరు?" ఇన్నిసార్లు ఉపఎన్నికలోచ్చాయికదా! ఒక్క నాయకుడైన ఆ త్యాగధనుల తల్లిదండ్రులకుగాని బంధువులకుగాని "టిక్కెట్లిచ్చారా?
       నాయకులందరూ  సత్తాలేని  రాజీనామాలిచ్చి త్యాగం చేసాం త్యాగం చేసాం అంటున్నారు. ఏంటి వీరి త్యాగం.
నా దృష్టిలో త్యాగం అంటే -రా.నా ఇచ్చినవాళ్ళు తెలంగాణా సాధించేవరకు మల్లీపోటీ చేయకూడదు.ఏ రాజకీయ పదవి స్వీకరించకూడదు.
ఇక KC R గారి  తె. రా.సాధనపట్ల గల చిత్తశుద్దిని శంకించ వలసి వస్తోంది. ఎందుకంటే గత పదేండ్లలో జరిగినఉద్యమాలలో ఆయన ఏరోజు ముందుండి LEAD  చేసిన దాఖలాల్లు లేవు. నాయకుడంటే  ఏలే వుండాలి?
సచ్చీలత కలిగి, ఏ దురలవాట్లులేకుండా  ప్రతిక్షణం ప్రజలకోసం పరితపించేవాడై ఉండాలి.అన్నీ తానే అయి ముందుండి నడిపించాలి.కాని  మన KCR  ఎక్కడుంటాడో తెలియదు .ఉద్యమము భయంకరంగా సాగుతుంటుంది.కాని ఈయన DELHI లో ప్రత్యక్షమవుతాడు. అక్కడ కెందుకెల్లాడో ఎవరికి తెలియదు.తనూ చెప్పడు.
       అసలు మొన్న జరిగిన సకల జనుల సమ్మె ఏంతో ఉదృతంగా జరుగుతూ ఉండింది. ఇంకో పది రోజులో,పదిహేను రోజులో జరిగితే ఖచ్చితంగా కేంద్రము దిగివస్తుంది లే అని అందరూ అనుకుంటున్న సమయం లో తుస్సుమనిపించేసారు. అసలు ఎవర్ని అడిగి సమ్మెను విరమించుకున్నారో ఆ చతుష్టయమునకే తెలియాలి.
      ఇంకొక విషయమేమంటే కెసిఆర్ గారు చెప్పే ఇంకో సులభమైన మాట-ఏ  పండగైన రానివ్వండి,"ఈ పండుగనుNEXTYEAR "తెలంగాణా రాష్ట్రంలో" జరుపుకుంటామని. ఇలా అన్ని అబద్దాలు చెప్తూ ,అమాయకులైన తెలంగాణాప్రజలను మోసం చేయడమే ,దగా చేయడమే ,వంచన చేయడమే అయన వ్రుత్తి,ప్రవ్రుత్తి.
     తెలంగాణా అనే విషయం కేంద్రం చేతిలో ఉందని ,ఇటలి ఇడియట్  "హస్తం"లో ఉందని చిన్న పిల్లోడికి కూడాతెలుసనే విషయం KCR కు కూడా తెలియందేమికాదు. అయినప్పటికీ అయన తెలుగు వారిని, తెలంగాణ వాదులను,జన్మతః తెలంగాణ వారిని(వారు తెరాస వారు కాకపోతే) తిడతాడు,తిట్టిస్తాడు,కొట్టిస్తాడు.కాని ఎవరిచేతిలోతెలంగాణా వుందో వారిని ఒక్క మాటకూడా అనడు. మరి ఇటలి హ్యాండ్ అంటే భయమో ఏమో తెలియదు. డైరెక్ట్గ గా-మేము తెలంగాణాకు వ్యతిరేకమని బల్ల గుద్ది మరీ మరీ చేబుతిన్న MIM ఒవైసీ వారిని కూడా ఏమీ  అనలేడు.మరి వారంటే సారుకు మరీ మరీ భయమేమో!
      కెసిఆర్ గారు  మీరు ఇప్పుడైనా చిత్తశుద్దితో తెలంగాణా వాదులందరినీ కలుపుకొని పోరాటము చేయండి.అభం శుభం తెలియని అమాయకులైన తెలంగాణా ప్రజానీకాన్ని ఇంకా మోసం చేయకండి!     యాగాలు,కుట్రలు,కుతంత్రాలు చేస్తేనో,బూతులు తిడితెనో,ప్రజలను భయపడిస్తేనో, విగ్రహాలను పడేస్తేనో తెలంగాణ
రాదు. మరొకసారి  మన జాతిపిత గాంధీ గారి జీవిత చరిత్రను క్షుణంగా చదవండి.ఆ మహానుభావుడి మార్గాన్ని అనుసరించండి.!
    వ్యూయర్స్/రీడర్స్ ! ఇది ఎవర్ని నొప్పించాలని  రాయలేదు. ఉన్నవాస్తవ పరిస్తితులను  ఉటంకించాను.

Saturday 10 March 2012

ఇంకా ఎంతమందిని చంపుతారు ?

     నీతి ,నిజాయతీగా పని చేసేవారికి ఈ దేశంలో స్థానం లేదా!? బ్రతికే హక్కు లేదా!!? బ్రతక్కూడదా!!!?


        మైనింగ్ మాఫియా మరొకసారి పడగవిప్పి M P లోని మారేనా జిల్లాలోబన్మోర్ SDPO గా పని చేస్తున్ననరేంద్ర కుమార్ సింగ్ IPS ని అతిదారుణంగా ట్రాలి ట్రాక్టర్తో తొక్కించి చంపింది.
        
       నిజాయితీ పరులైన కొందరు అధికారులు, సమాజ సేవకులు, ఉద్యమకారులు,విలేఖర్లు ,కార్యకర్తలను మాఫియ మూకలు  అంతమొందిస్తున్నాయి.
   
   మొన్నటికిమొన్న చెన్నైలోని ఆవడిలో భువనేశ్వరన్  అనే  సోషల్ వర్కర్ ని  bike నుండి లాగి తన నాలుగేళ్ల    కూతురుముందే realestate mafia నరికి చంపింది.ఇతను చేసిన పాపం-రియల్ ఎస్టేట్ గూండాలను  ఎదుర్కోవడమే!

అలాగే గత నెలలో చంద్రిక రాయ్ అనే విలేఖర్ని,అతని కుటుంబాన్ని మైనింగ్ మాఫియా  MP లో మట్టుపెట్టింది. ఇతను చేసిన నేరము-MP లోని ఉమరియా జిల్లాలో అక్రమ బొగ్గు తవ్వకాలపై పేపర్లో రాయడమే!

గతేడాది జార్ఖండ్ లో కేరళ రాష్ట్రానికి చెందిన సిస్టర్ వల్సా జాన్ అనే NUN ను COAL MAFIA  చంపేసింది.ఈమె చేసిన  మంచి పని-బొగ్గి మాఫియా ని ఎదుర్కోవడమే .

భోపాల్లో-DIAMOND MAFIA  ,సేహ్ల మసూద్ అనే  R T I ఉద్యమరాలుని కాల్చి చంపింది.

ఇలా చెప్పుకుంటూ పొతే-ఒక  శంకర్ గుహ నియోగి-విప్లవ కార్మిక నాయకుడు,ఒక జ్యోతిర్మయి డే-ముంబై ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ను,ఒక సోనేవానే-అదనపు జిల్లా కలెక్టర్,ఓ మంజునాథ్-I O C గ్రేడ్ ఎ ఆఫీసర్ ను చమురు మాఫియా తగులబెట్టి చంపేసింది.
                             
                                     ఇలా ఇంకా ఎంతమందిని చంపుతారు?
           
    ఇలా ఎంతోమంది నిజాయితీపరులను -గనులు,ఇసుక,ఆటవి ఉత్పత్తులు,వన్య ప్రాణులు,రియల్ ఎస్టేట్,ఆయిల్ మరియు మద్యం మాఫియాలు,నిర్భయంగా,నిస్సుగ్గుగా ,నిశ్చింతగా  అంతమొందిస్తింటే ఈ చేతకాని చవట ప్రభుత్వాలు ఏమిచేస్తున్నాయో నాకర్థం కావటం లేదు.

ఈవిధంగా  నీతి నిజాయితీ గల వాళ్ళని,మంచివాళ్ళని చంపు కుంటూ పోతుంటే,వాళ్ళను మనము కాపాడుకోలేక పోతుంటే-భావితరాలకు మనము వీళ్ళను   ఎలా  చూపగలము?
     
అసలు ఈ MAFIA GANG లన్ని ఇలా రేచిపోతుంటే , ఎవరైనా నిబద్ధత కలిగి,నీతి నిజాయితీతో  తమ తమ కార్యకలాపాలను నిర్వర్తించటానికి ముందుకు రాగలారా!?